విశాలాంధ్ర-గూడూరు : గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో ఉన్న ముదిరాజుపాలెంలో ముచ్చు నాంచారయ్య అనే వ్యక్తి మృతిచెందాడు. ఈయనకు కొడుకులు లేరు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ పెళ్లిళ్లు చేసి ఆర్థికంగా చాలా వెనకబడిపోయాడు. అది తెలుసుకున్న మల్లవోలుకి చెందిన హెల్పింగ్ హాండ్స్ అనే స్వచ్ఛంద సేవ సంస్థ ఈయన దహన సంస్కారాల నిమిత్తం 5000 రూపాయలు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ పడవల మోహన్ త్రినాధ్ ప్రత్తిపాటి స్వామి నాయుడు వాకాలయ్య ముచ్చు సుబ్రహ్మణ్యం తదితర ముదిరాజుపాలెం పెద్దలు పాల్గొన్నారు.