Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సహాయం

విశాలాంధ్ర – గూడూరు: గూడూరు మండలం, గూడూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు డొక్కా. వీర్రాజు మృతి చెందారు. శనివారం నాడు సంఘం చైర్ పర్సన్ తలుపుల. వెంకట కృష్ణారావు డైరెక్టర్లు మేము. ఆనందరావు ,ఆకూరి . శ్రీనివాస రావు సంఘం కార్యదర్శి ఎల్ .వి.ఏ చక్రవర్తి ఆధ్వర్యంలో గూడూరు గ్రామ సర్పంచ్ లింగం . సులోచన మరియు వైయస్సార్ పార్టీ నాయకులు గోరు పత్తి . రవి చేతుల మీదగా డొక్కా. వీర్రాజు భార్య సావిత్రి దేవికి మట్టి ఖర్చులు నిమిత్తం రూ. 10,000/-(పదివేల ) నగదు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం చైర్ పర్సన్ తలుపుల. వెంకట కృష్ణారావు మాట్లాడుతూ గతంలో మట్టి ఖర్చులు కింద 5000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని ఇప్పుడు పదివేల రూపాయలకు పెంచటం పట్ల రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img