విశాలాంధ్ర`విజయవాడ : దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యవసరాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం చేపట్టిన ‘రాజ్భవన్ ఘెరావ్’ను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్లో ఉన్న ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.శైలజానాథ్, నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టును దోనేపూడి శంకర్ ఖండిరచారు. ఆయన వెంట సీపీఐ విజయవాడ నగర కార్యదర్శివర్గ సభ్యుడు కేవీ భాస్కర్రావు కూడా ఉన్నారు.