Friday, April 19, 2024
Friday, April 19, 2024

మట్టి ఖర్చులకు ఆర్థిక సాయం

విశాలాంధ్ర – గూడూరు: గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు అబ్దుల్ .జలీల్ ,గమిడి. వెంకట శివ నాగేశ్వరరావు, బొల్లా. పాండురంగారావు, ముక్క. కృష్ణ మోహన రావు ఈ నలుగురు వ్యక్తులు ఈ మధ్యకాలంలో అకాల మరణం చెందారు . ఈ సందర్భంగా శనివారం ఆ నలుగురి కుటుంబాలకు మట్టి ఖర్చులకు నిమిత్తం ఒక్కొక్కరికి రుా.10 వేలు , చప్పున నలుగురికి కలిపి రుా.40 వేలు, కే డి సి సి బ్యాంక్ వారి సర్కులరును అనుసరించి, మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడమైనది . ఈ కార్యక్రమంలో సంఘం చైర్ పర్సన్ దాసరి. రమేష్, దీకుళల. రాజు, పీటా. శివ పార్వతి, గ్రామ సర్పంచ్ బొర్రా. సాంబ శివయ్య, మండల ఆర్బికె చైర్మన్. పర్ణం. మహా లక్ష్మయ్య నాయుడు, సంఘ సీఈవో తుమ్మల. గణేష్ మరియు సిబ్బంది, గ్రామ వైయస్సార్ పార్టీ పెద్దలు, గ్రామ రైతులు పాల్గొనటం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img