Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

న్యాయవాదులు విధులు బహిష్కరణ

విశాలాంధ్ర – మైలవరం: కర్నూలు జిల్లా డోన్ బార్ అసోసియేషన్ కోశాధికారి న్యాయవాది పులి దామోదరపై కొంతమంది దుండగులు దాడి చేసి హత్య ప్రయత్నం చేయడాని నిరసిస్తూ మైలవరం బార్ అసోసియేషన్ న్యాయవాదులు బుధవారం తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు న్యాయవాది పులి దామోదర్ డోన్ పట్టణంలో జరుగుతున్న మెడికల్ మాఫియా పై ఆర్టిఐ ద్వారా సమాచారం సేకరించడానికి అర్జీ దాఖలు చేసిన విషయం దీనిని ఆసరాగా తీసుకొని మెడికల్ మాఫియా గతంలో ఒకసారి దాడి చేసి తీవ్రంగా గాయపరచడం మరల సోమవారం ఉదయం దామోదర్ పై దాడి చేసి అత్యా ప్రయత్నానికి పూనుకోవడం దారుణమని దుండగులను వెంటనే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సమావేశాల్లోనే న్యాయవాదులు రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైలవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముల్లంగి రవికుమార్ సీనియర్ న్యాయవాదులు పివి శేషగిరిరావు ఎస్ వి కే సత్యనారాయణ రావు బుద్ధవరపు వెంకట్రావు వీటి కిషోర్ ఎడి ప్రసాద్ కార్యదర్శి ఎం శరత్ బాబు సహాయ కార్యదర్శి పి రాము పి రవి కిషోర్ ఎం తనూజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img