Friday, April 19, 2024
Friday, April 19, 2024

మైలవరం సర్వసభ్య సమావేశం

విశాలాంధ్ర-మైలవరం :మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నాడు స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో ఆధ్వర్యంలో ఎంపీపీ ఇస్లావత్తు ప్రసన్న రాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ ఇస్లావతు ప్రసన్న రాణి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగిందని, అభివృద్ధి పనులకు సంబంధించి మండలంలో చేపట్టిన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ ఇప్పటివరకు చేపట్టిన పనులను, మును ముందు చేపట్టబోవు పనుల గురించి సమావేశంలో వివరించారు. కార్యక్రమంలో జడ్పిటిసి సర్నాల తిరుపతి రావు, ఏఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img