విజయవాడ : విజయవాడ 47వ డివిజన్ లో పర్యటించిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మరియు రాయన నరేంద్ర కుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రశంసా పత్రం అందుకున్న హెల్ప్ ది హోప్ లెస్ సేవా సంస్థ అధ్యక్షులు ఈదులూరి రాధాకృష్ణను బుధవారం శాలువాతో అభినందించారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి గోదావరి గంగ, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు గోదావరి బాబు, కనపర్తి శ్యామ్ కుమార్, ఎ.పి. ఎన్.జి.ఒ. నాయకులు జిల్లా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.