Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వక్ఫ్‌ బోర్డ్‌ ప్రత్యేక అధికారిగా షేక్‌ షెరీన్‌ బేగం

విశాలాంధ్ర – విజయవాడ (వన్‌టౌన్‌): ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ బోర్డ్‌ ప్రత్యేక అధికారిగా షేక్‌ షెరీన్‌ బేగంను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత వక్ఫ్‌ బోర్డు కాలపరిమితి ఈ నెల 13వ తేదీన ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వక్ఫ్‌ సర్వే కమిషనర్‌గా ఉన్న షెరీన్‌ బేగంను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు మైనారిటీ శాఖ కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img