Friday, April 19, 2024
Friday, April 19, 2024

శాసన సభ్యుని చేతుల మీదుగా మండల సమైక్యకు సన్మానం

ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి: మండల మహిళా సమైక్య అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నిక కాబడిన గంగిపోగు శిరీష రమేష్ లను రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను మండలంలోని లింగాల మామిడి తోటలో ఏర్పాటు చేసుకున్న అభినందన సభలో శాలువాతో సత్కరించారు……ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నూతనంగా ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన శిరీష రమేష్ లకు ముందుగా అభినందనలు తెలియజేశారు….. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అభివృద్ధి పథంలో నడిపించడానికి నాలుగడుగులు ముందుకు వేస్తుందని మహిళా సాధికారిత పురోభివృద్ధి వైయస్సార్ చేయూత అనేక సంక్షేమ పథకాలను మహిళల ముందుంచిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు….. నమ్మకంతో ఏకగ్రీవంగా ఇంతటి బాధ్యతలు తనకు అప్పగించిన ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా ఉంటానని ఎటువంటి లాభా పేక్ష ఆశించకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా మహిళల అభివృద్ధి కొరకు మరియు ఆర్థికంగా మహిళలు ఎదగడానికి తనవంతుకృషి చేస్తానని సభాముఖంగా శిరీష రమేష్ తెలిపారు….. అదేవిధంగా ఆత్మీయ విందును అందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైసిపి నాయకులు కార్యకర్తలు జడ్పిటిసి ఏసు పోగు దైవమని శ్రీనివాస్, వైకాపా సర్పంచులు, ఎంపీటీసీలు సొసైటీ అధ్యక్షులు,ఏపీఎం,వివోలు,యానిమేటర్స్ డ్వాక్రా మహిళలు తదితర వెలుగు సిబ్బంది భారీ స్థాయిలో పాల్గొన్నారు,,,,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img