Friday, April 19, 2024
Friday, April 19, 2024

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు


విశాలాంధ్ర-పెద్దకడబూరు : అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్ చిన్న మహాదేవ,వైసీపీ వైకాపా నేత మహాదేవ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. అర్హత ఉండి పథకాలు అందకపోతే తన దృష్టికి తెస్తే తప్పనిసరిగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాభివృధ్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి, విధ్యాదీవెన, విద్యావసతి తదితర పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. అనంతరం ఎంపీపీ 14వ ఆర్థిక సంఘం కింద మంజూరైన 3 లక్షల రూపాయలతో రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీ, గ్రావెల్ వేయడానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్,నాయకులు విజయేంద్ర రెడ్డి, శివరామిరెడ్డి, అయ్యప్ప, మూకిరెడ్డి, హరిశ్చంద్ర, ఈరన్న, గాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img