విశాలాంధ్ర..నందికొట్కూరు : మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు రిజర్వాయర్ను టిడిపి నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మంగళవారం కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్ కట్ట తెగి కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కట్ట మరమ్మతులు చేపట్టడంలో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో అవి అమలు కావడం లేదన్నారు. రిజర్వాయర్ కట్ట తే గడంతో గడివేముల మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలకు, రైతన్ననికి తాగునీరు, సాగునీరు అందడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు రిజర్వాయర్ కట్ట త్వరగా మరమ్మతులు చేయించి రైతాంగని ఆదుకోవాలని అన్నారు. ఈమెతోపాటు మిడుతూరు, గడివేముల మండలాల టిడిపి నాయకులు ఖాతా రమేష్ రెడ్డి, మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శివరాం రెడ్డి, నాగలూటి రవీంద్రబాబు, మహేశ్వర్ రెడ్డి, బాబు సాహెబ్, రంగారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.