Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అసత్య ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు

విశాలాంధ్ర-పెద్దకడబూరు : సిపిఐ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కఠిన చర్యలు తప్పవని ఏఐకెఎస్ తాలూకా కార్యదర్శి ఆంజనేయ, సిపిఐ పార్టీ సభ్యులు రాజు, శాఖ కార్యదర్శి సర్దాజ్ పటేల్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని సీపీఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో గతంలో సర్వేనెంబర్ 175/దీ, 174/1 లలో లక్ష్మన్న, రమేష్ అనే వ్యక్తికి భూ వివాదాలు ఉన్నాయన్నారు. దీంతో సిపిఐ పార్టీని ఆశ్రయించగా సమస్యపై తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు ఆ భూమిపైన వివాదాలు ఉన్నాయని అప్పట్లో ఆర్డీఓ తాహశీల్దార్ కు ఫోన్ చేసి రెడ్ మార్క్ పెట్టడం జరిగిందన్నారు. రమేష్ అనే వ్యక్తి లక్ష్మన్న 13 ఎకరాలు ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టాలు పొందారని, పట్టాలు రద్దు చేసి భూమిలేని నిరుపేదలకే దక్కాలని రమేష్ చెప్పడంతో పార్టీ జోక్యం చేసుకొని భూ పోరాటం చేయడం జరిగిందన్నారు. ఇంతలోనే లక్ష్మన్న రమేష్ తో డబ్బులు ఒప్పందం చేసుకొని సమస్య పరిష్కారానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా ఇది కోర్టులో ఉందని చెప్పడంతో రమేష్ కు ఏం చేయాలో తెలియక మా నాయకునిపై డబ్బులు ఇచ్చానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇది కేవలం భూ పోరాటాన్ని ఆపడానికే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి పేదలకు చెందే వరకు వెనక్కి తగ్గేదే లేదని, తమ ప్రాణాలను అడ్డు పెట్టైనా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఇప్పటికైనా నాయకులపై అసత్య ఆరోపణలు మానుకోవాలని లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇస్మాయిల్, తిక్కన్న, డోలు హనుమంతు, నర్సింహులు, ముద్ద రంగప్ప, నాగేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img