టిడిపి యువ నాయకుడు లోకేష్ బాబును కలిసిన మన్సూర్ అహ్మద్
విశాలాంధ్ర – ఆదోని : టిడిపికి కంచుకోటైన ఆదోని నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించి అభ్యర్థిని ప్రకటిస్తే ఆదోని కోట పై టిడిపి జెండా ఎగురవేస్తామని టిడిపి యువ నాయకుడు, దూదేకుల సంఘం ఆదోని పట్టణ అధ్యక్షుడు మన్సూర్ అహ్మద్ అన్నారు. మంగళవారం హైదరాబాదులో టిడిపి యువ నాయకులు, మాజీ మంత్రి లోకేష్ బాబును కలిసి ఆదోనిలో నెలకొన్న పార్టీ సమస్యలపై వివరించారు. ఈ సందర్భంగా మన్సూర్ అహ్మద్ మాట్లాడుతూ ఆదోని టిడిపిలో వర్గపోరుతో కార్యకర్తలు బాధపడుతున్నారని, తల్లి లాంటి పార్టీలో చీలిక రావడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని లోకేష్ బాబుకు వివరించడం జరిగిందన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించి అభ్యర్థిని గెలిపించుకోవడం మా బాధ్యత అని, ఆదోని లో పార్టీ సమస్యను జిల్లా, రాష్ట్ర నాయకులతో చర్చించి వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది అన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పార్టీ ఎంత త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే ప్రజల్లో, కార్యకర్తల్లో, యువతలో ఉత్సాహాన్ని నింపి ఆదోనిలో టిడిపి జెండా ఎగురవేస్తామని వివరించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత మార్పు కోరుతుందని, యువత ఎల్లప్పుడూ మీ వెంటే ఉందని మేమంతా పార్టీకి కోటగా మారి ఆ కోటకు మరోసారి చంద్రబాబుని సీఎం చేయాలని కష్టపడుతున్నామని చెప్పడం జరిగింది అన్నారు. రాష్ట్రంలో దూదేకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారికి రాజకీయ అవకాశం ఇవ్వాలని లోకేష్ బాబును కోరడం జరిగిందని తెలిపారు. అంతకుముందు లోకేష్ బాబు చేతుల మీదుగా నూతన 2023 డైరీ ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమస్యలు విని స్పందించిన లోకేష్ బాబు త్వరలో ఆదోని పార్టీలో నెలకోన్న సమస్యను పరిష్కరించి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు.