విశాలాంధ్ర-పెద్దకడబూరు : ఆర్ ఓ ఆర్ కేసును పక్కదోవ పట్టించిన వీఆర్వో తిప్పన్నను సస్పెండ్ చేయాలంటూ గురువారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో 177/1, 174/1, 177/3a, 177/3ప సర్వేనెంబర్లు గల భూమి ప్రభుత్వ భూమి అన్నారు. ఈ భూములను భూమి లేని నిరుపేదలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ భూములను పెత్తందారులు నిరుపేదలను భయాందోళనకు గురిచేసి దౌర్జన్యంగా లాక్కోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సిపిఐ పార్టీ ఉద్యమాలు చేపట్టి భూములను నిరుపేదలకు ఇవ్వాలని దశలవారీగా ఉద్యమాలు చేపట్టడంతో ఇప్పుడు కేసు ఆర్ ఓ ఆర్ కేసుగా నడుస్తుందని తెలిపారు. ఈ భూములను ఇప్పటివరకు రీసర్వే కూడా చేయలేదని, కానీ కల్లుకుంట గ్రామానికి చెందిన వీఆర్వో తిప్పన్న పెత్తందారులతో లంచాలకు కక్కుర్తి పడి ఆర్ ఓ ఆర్ కేసు నడుస్తున్నా పాసుపుస్తకాలు చేయించారని విమర్శించారు. సర్వే చేయించకుండ పాసుపుస్తకాలు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తాహశీల్దార్ ను, వీఆర్వో తిప్పన్నను సస్పెండ్ చేసేంతవరకు సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, ఏఐవైఎఫ్ నాయకులు జాఫర్ పటేల్, నాయకులు ఇర్ఫాన్ పటేల్, తిక్కన్న, డోలు హనుమంతు, గిడ్డయ్య, ఆంజనేయ, నాగరాజు, కుమ్మరి చంద్ర, గోపాల్, వీరాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.