Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కత్తి నరసింహారెడ్డిని, పోతుల నాగరాజును గెలిపించాలి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కత్తి నరసింహారెడ్డిని, పట్టభద్రుల ఎన్నికలలో పోతు నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలపించాలని ప్రజా సంఘాల నాయకులు బాస్కర్ యాదవ్, వీరేష్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని కల్లుకుంట, కంబలదిన్నె, హెచ్ మురవణి, పెద్దకడబూరు గ్రామాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకిత భావంతో చిత్త శుద్ధితో అధ్యాపక, ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి కత్తి నరసింహారెడ్డి అని అన్నారు. సమస్యల పరిష్కారానికై మన గళాన్ని తన గళంగా, మన వాణిని తన బానిగా చేసుకొని పోరాడుతున్నాడన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి రావడం, విద్యార్థి దశ నుంచే పోరాటాలలో పాల్గొన్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో సైతం 3652 కిలోమీటర్లు తిరిగి కోవిడ్ తో మరణించిన 152 మంది ఉపాధ్యాయుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం నింపారన్నారు. కావున రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కత్తి నరసింహారెడ్డిని, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోతుల నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, రాము, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img