Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించండి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : ఈనెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రంగన్న, జిల్లా సమితి సభ్యులు తిమ్మగురుడు అన్నారు. గురువారం మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్దకడబూరులోని ఆదర్శ పాఠశాల, కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కత్తి నరసింహారెడ్డి విద్యార్థి దశ నుండే విద్యార్థి సంఘ నేతగా సమస్యలపై ఉద్యమాలు చేశారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా 3652 కిలోమీటర్లు తిరిగి కోవిడ్ తో మరణించిన 152 మంది ఉపాధ్యాయుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం నింపారన్నారు. అలాగే బహుజన ఉద్యమ సారథి, రాయలసీమ అభివృద్ధి మార్గదర్శి పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు సామాజిక దృక్పథంతో వివిధ సమసలపై రాజీ లేని పోరాటం చేస్తున్న సమర్థుడైన నాయకుడు అన్నారు. కావున ఉద్యమ నేతలకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి శాసనమండలికి పంపాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ, ఏఐఎస్ఎఫ్ నాయకులు రామాంజనేయులు, నాయకులు వీరేష్, ఆంజనేయులు, బీసన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img