Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్పోరేట్లకు కొమ్ము కాస్తున్న బిజెపి ప్రభుత్వం

విశాలాంధ్ర, పెద్దకడబూరు : కార్పోరేట్లకు కొమ్ము కాస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ, సిఐటియు మండల కార్యదర్శి ఈరన్న అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ దుర్మార్గాలను, మతతత్వ కార్పోరేట్ కూటమి దుర్నీతిని ప్రశ్నించకుండా ప్రజలు గుర్తించకుండా చేయడానికి ఎక్కడికక్కడ మతకలహాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. మనందరి ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకులు, మనం కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ఓడరేవులను, ఆఖరికి మనందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు ధారాదత్తం చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి అవినీతి మయం అయిన బిజెపి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న, నాగేంద్ర, పెద్ద అయ్యన్న, గిడ్డయ్య, మునెప్ప, రమేష్, అంజనేయ, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img