జగనన్న గృహాలను పరిశీలిస్తున్న మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు
విశాలాంధ్ర`పెద్దకడబూరు : మండలంలో జగనన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని రంగాపురం, చిన్నకడబూరు గ్రామాలలో జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న గృహాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి 1135 జగనన్న గృహాలు మంజూరు అయ్యాయన్నారు . వీటిలో ఎన్ ఎస్ – 8, బిబిఎల్ – 692,బి ఎల్ – 106, ఆర్ ఎల్ – 63, ఆర్ సి – 111, పూర్తి అయినవి – 135 ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణానికి 5.27 కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యడం జరిగిందన్నారు. వివిధ స్థాయిలలో ఉన్న 173 ఇళ్లు కూడా త్వరితగతిన పూర్తిచేసుకొని డిసెంబర్ 21న గృహ ప్రవేశాలకు సన్నద్దం చేయాలని సూచించారు. బిఎల్ లో ఉన్న వాటిని ఆర్ సి స్థాయికి తీసుకో రావడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకట రమణప్ప, హౌసింగ్ ఏఈ వేణుగోపాల్, వర్క ఇన్స్పెక్టర్లు నాగన్న, మాధవీలత, లబ్ధిదారులు పాల్గొన్నారు.