విశాలాంధ్ర-పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి వేడుకలు టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నరవ రమాకాంతరెడ్డి ఇంటి నుంచి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఆవరణంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరవ రమాకాంతరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దేశ వ్వాప్తంగా చాటి చెప్పారని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, టౌన్ అధ్యక్షులు మల్లికార్జున, కార్యదర్శి మీసేవ ఆంజనేయులు, నాయకులు మధుసూదన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, దశరథరాముడు,వీరేష్ గౌడ్, అంజి, నరసన్న, ముక్కన్న, మునెప్ప, నర్సిరెడ్డి, ఈరన్న, వెంకటరామిరెడ్డి, రంగన్న, నర్సింహులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.