Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

విశాలాంధ్ర ` బొమ్మనహాళ్‌ : శ్రీనివాస రామానుజన్‌ 135 జయంతి పురస్కరించుకుని బొమ్మనహాళ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రం కు సంబంధించిన గణిత నమూనాలు తో కూడిన ప్రదర్శనలో విద్యార్థులు చేసిన వివిధ రకాల గణిత నమూనాలు వాస్తవ సంఖ్యలు , అంతర కోణాలు, మేజిక్‌ చార్ట్‌, వేళ్ళతో త్రికోణమితి నిష్పతి ని కనుగొనుట వంటి నమూనాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్‌ కమిటీ చైర్మన్‌ కురుబ నాగరాజు ఉపాధ్యాయులు అరవింద్‌ కళ్యాణి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img