విశాలాంధ్ర`శెట్టూరు : శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత, కేజీబీవీ పాఠశాలలో గురువారం పాఠశాల కేజీబీవీ ఎస్ఓ లలితమ్మ గణిత ఉపాధ్యాయులు కళ్యాణి దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ, పేదరికంలో జన్మించినప్పటికీ రామానుజన్ గొప్ప గణిత శాస్త్రవేత్తగా ఎదగారని విద్యార్థులకు కూడా ఆ విధమైన ఇష్టాన్ని పెంచుకొని ఉన్నత శిఖరాలు అదిరోహా%శీ%చాలని తెలియజేశారు విద్యార్థులకు గణిత నమూనాలు తో కూడిన ప్రదర్శనలో విద్యార్థులు చేసిన వివిధ రకాల గణిత నమూనాలు వాస్తవ సంఖ్యలు , అంతర కోణాలు, మేజిక్ చార్ట్, వేళ్ళతో త్రికోణమితి నిష్పతి ని కనుగొనుట వంటి నమూనాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఓబులేష్, అశోక్ కుమార్, లాలిస్వామి, భాస్కర్ రెడ్డి, లోకనాథ్, జీవన్ బాబు, రాజగోపాల్, జయుశ్రీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు