విశాలాంధ్ర/ ఆస్పరి : మండల పరిధిలోని చిగిలి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న 49 మంది విద్యార్థులకు గ్రామ సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ రాధాకృష్ణ లు బుధవారం ప్రధానోపాధ్యాయులు కాశీ విశ్వనాథ్ శాస్త్రి ఆధ్వర్యంలో ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని అందులో ప్రధానంగా విద్యార్థులకు ట్యాబులను అందించి డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. సమాజంలో ఉన్న అంతరాలను తొలగించడానికి ప్రతి విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.