Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చేతగాని ప్రభుత్వాన్ని సాగనంపండి

విశాలాంధ్ర` పెద్దకడబూరు : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చేతగాని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు ఏసేపు, టిడిపి బిసి సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలలో టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి, వైసీపీ మోసిలను వివరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో టీడీపీని ఆదరించి, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్‌ కార్యదర్శి ఆంజనేయ, నాయకులు ఆశ, అంజి, ఇమ్మానియేలు, సుధాకర్‌, జయపాల్‌, పురుషోత్తం, ఆదాము, నరసన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img