Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగన్ ను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఆశీర్వదించాలని వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక చౌడేశ్వరీదేవి కాలనీలో జగనన్నే మా భవిష్యత్తు – మా నమ్మకం కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం ప్రచురించిన ప్రశ్నలకు జవాబులు రాబట్టి నమోదు చేశారు. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 20 వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని కోరారు. అనంతరం రాష్ట్రం ముద్రించిన స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, గ్రామ సర్పంచులు రామాంజనేయులు, చంద్రశేఖర్, మాజీ ఎంపిపి రఘురామ్, కో ఆప్షన్ సభ్యులు షేర్ ఖాన్ పటేల్, నాయకులు గజేంద్ర రెడ్డి, గుడిసె శివన్న, విజయేంద్ర రెడ్డి, నవీన్ రెడ్డి, శివరామరెడ్డి, జాము మూకన్న, తిక్కన్న, ముక్కరన్న, అర్లప్ప, మొట్ర దస్తగిరి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img