Friday, April 19, 2024
Friday, April 19, 2024

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకోరావాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకోరావాలని ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం పెద్దకడబూరులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు సోమన్న అధ్యక్షతన భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని సేవ్ జర్నలిజం – సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టుల రక్షణ కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. జర్నలిస్టులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని దేవుడు ప్రసాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాలూకా సహాయ కార్యదర్శి ఈరన్న, మండల కోశాధికారి నారాయణ, సహాయ కార్యదర్శి లింగమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img