విశాలాంధ్ర – ఆత్మకూర్ : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్, సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో సిగరెట్ మరియు, పొగాకు ఉత్పత్తుల చట్టం సి ఒ టి పి ఏ -2003 గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సి ఒ టి పి ఏ -2003 చట్టం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే 200 రూపాయలు జరిమానా విధించబడుతుందని వారు పేర్కొన్నారు. అదే విధంగా విద్యాసంస్థలకు చుట్టు ప్రక్కల వంద గజాలలోపు ఎలాంటి పొగాకు ఉత్పత్తులను అమ్మరాదనీ వాటిని నిషేధించడం జరిగిందనీ తెలిపారు. ఇందుకు అతిక్రమించిన వారు శిక్షార్హులన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు సంబంధించిన పదార్థాలు అమ్మ రాదు వారిచేత విక్రయించరాదనీ తెలిపారు. సిగరెట్, బీడీ, గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, వాడటం వలన ప్రాణాంతకమైన క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి సంభవిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ శ్రీరాములు హాజరై, చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు పోలీస్ వారి సహకారంతో ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో 6 లక్షలా 84 వేల రూపాయలు చలానా రూపంలో ఫైన్ విధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.