Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జాలవాడిలో ఘోరం

భార్య, అత్తను హత్య చేసిన భర్త
విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల పరిధిలోని జాలవాడి గ్రామానికి చెందిన కురువ నాగరాజు పైసలు కోసం తాగిన మైకంలో భార్య శాంతి (26), అత్త భీమక్క (60) లను శుక్రవారం తెల్లవారుజామున వేటకొడవలితో నరికి హత్య చేసి పరారైనట్లు ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. హత్య సంఘటనపై కోసిగి సీఐ ఎరిషావలి, ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో డీఎస్పీ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కురువ నాగరాజు రోజు మద్యం సేవిస్తూ ఇంట్లో భార్య శాంతిని పుట్టింటి నుండి డబ్బులు తేవాలని కొట్టేవాడని తెలిపారు. నాగరాజు ఇంటి నిర్మాణ సమయంలో శాంతి పుట్టింటి నుండి రూ. 2 లక్షలు తెచ్చిందని, అయినా నాగరాజు పైసలు కోసం నిత్యం మద్యం సేవించి హింసించేవాడని స్పష్టం చేశారు. ఇంట్లో మనవరాలికి తట్టు పోయడంతో సద్ది తీసుకొని భీమక్క కూతురింటికి వచ్చిందని తెలిపారు. రోజు మాదిరిగానే మద్యం సేవించి వచ్చిన నాగరాజు భార్యతో గొడపడి కొడుతుండగా అత్త భీమక్క అడ్డం రావడంతో తాగిన మత్తులో ఉన్న నాగరాజు వేటకొడవలితో దారుణంగా హత్య చేసినట్లు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లి మరణించడంతో కూతురు, ఇద్దరు కుమారులు అనాధలైనారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img