Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీతాలు ఉద్యోగులు,పెన్షనర్లకు ఒకటవ తేదీన చెల్లించాలి

నవంబర్‌ నెల జీతాలు తక్షణమే జమ చేయాలి
ఎస్‌ టి యు జిల్లా కార్యదర్శి నాగేంద్రప్ప

విశాలాంధ్ర-ఆస్పరి : ఉద్యోగ,ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు జీతాలు ఒకటవ తేదీన చెల్లించుటకు నిర్దిష్ట మైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ టి యు జిల్లా కార్యదర్శి నాగేంద్రప్ప డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీపీ మెయిన్‌ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్ల కు జీతాలు ఆలస్యంగా రావడం వలన అనేక ఇబ్బందులకు గురి అవుతు, తమలో తామే కుములిపోతు, బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్‌ నెల ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను ఇప్పటి వరకు కూడా జమ చేయలేదని, అలాగే ఈనెల 9వ తేదీ దాటిన జీతాల కోసము ఉద్యోగులు ఎదురు చూడవలసిన దుస్థితి నెలకొందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన విషయం మరువకూడదని, ఇటువంటి సందర్భం లో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలని వెంటనే నవంబర్‌ నెల వేతనాలు ఉద్యోగుల బ్యాంక్‌ ఖాతాలలో జమ చేయాలని నాగేంద్రప్ప కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ టి యు మండల నాయకులు జ్యోతి మూర్తి, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img