ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
విశాలాంధ్ర`ఆస్పరి : మండల పరిధిలోని కైరిప్పల గ్రామపంచాయతీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అంగడి వీరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం కైరిప్పల గ్రామంలోని స్థానిక ఊరి వాకిలి వద్ద ప్రధాన రహదారిపై నిలిచిపోయిన డ్రైనేజీ మురిగి నీటిని పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్ అధ్యక్షత జరిగిన నిరసన కార్యక్రమంలో అంగడి వీరేష్ మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ నీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యకు పరిష్కారం చూపాలని పలుమార్లు సర్పంచు, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన యాటకల్లు కు వెళ్ళు రోడ్డుపై గత కొన్ని సంవత్సరాలుగా మురుగునీరు, వర్షపు నీరు నిలిచిపోవడంతో బాటసారులకు, వాహనదారులకు సమస్యగా మారిందన్నారు. పారిశుద్ధ్య సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మౌలిక సదుపాయాలు లేక నిత్యం ఆ కాలనీ ప్రజలు విష జ్వరాలు, వ్యాధులు బారినబడి అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని, తక్షణమే డ్రైనేజీ కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వీరేష్, బి.కె బద్రి, జయరాజు, ధనుంజయ, భాస్కర్, నవీన్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి యువరాజు, గ్రామ ప్రజలు శంకరానంద స్వామి, వెంకట్, రాముడులు పాల్గొన్నారు.