Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

విశాలాంధ్ర` పెద్దకడబూరు : గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వైసీపీ నేత మూకిరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పీకలబెట్ట గ్రామంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్‌ లక్ష్మి, వైసీపీ నేత మూకిరెడ్డి ఆధ్వర్యంలో తాగునీటి బోరు వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి చొరవతో బోరు వేయిస్తున్నట్లు తెలిపారు. దీనికి కరెంటు మోటార్‌ ఏర్పాటు చేసి గ్రామంలోని అన్ని వీధులకు తాగునీరు అందిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img