విశాలాంధ్ర-పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో ఎస్సీ స్మశాన వాటికకు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి సహకారంతో 40 వేల రూపాయలతో గేటు ఏర్పాటు చేయడం జరిగింది. స్మశాన వాటికకు గేటు ఏర్పాటు చేయు విషయాన్ని టిడిపి టౌన్ అధ్యక్షులు వీరేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఈరన్న మంత్రాలయం ఇంచార్జీ తిక్కారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తక్షణమే స్పందించి 40 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. స్మశాన వాటికకు గేటు ఏర్పాటుకు సహాయం చేసిన తిక్కారెడ్డికి ఎస్సీ కాలనీ వాసులు శనివారం కృతజ్ఞతలు తెలిపారు.