విశాలాంధ్ర, పెద్దకడబూరు :ప్రజల దాహార్తిని తీర్చిదిద్దేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఫ్రెండ్స్ సంస్థ సభ్యులు నాగరాజు, సతీష్, రఘు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని ఫ్రెండ్స్ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ఇతర ప్రాంతాల నుంచి తమ పనుల నిమిత్తం పెద్దకడబూరుకు నిత్యం ఎంతో మంది వస్తూ ఉంటారన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి దాహార్తిని తీర్చిదిద్దేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. చలివేంద్రంను మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.