నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల యందు గురువారం ‘జగనన్న క్రీడా పోటీలు’ మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తన మిత్రబృందంతో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడు లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ 50 లక్షల నగదుతో జగనన్న క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ క్రీడా ఎంపికలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని క్రీడాకారులు క్రీడలలో నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడా చైర్మన్ ఎంపీడీవో శోభారాణి, కన్వీనర్ శ్రీనాథ్ పేరు మల్ల, నంద్యాల షాప్ కోఆర్డినేటర్ స్వామి దాసు రవికుమార్, నందికొట్కూరు ఎంపీపీ మురళి కృష్ణారెడ్డి, జూపాడు బంగ్లా జడ్పిటిసి జగదీశ్వర్ రెడ్డి, పగిడాల జడ్పిటిసి దివ్య, నాగిరెడ్డి, ఆర్టీసీ బాబు, సూది రెడ్డి రమేష్ రెడ్డి, శ్రీకాంత్, ఎంపీపీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.