విశాలాంధ్ర – నంద్యాల సిటీ : కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో మరో హత్య జరిగింది. దేవనగర్కు చెందిన నాగ త్రిలోచన అనే యువకుడిని దుండగులు హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే కారణమా.. లేక వివాహాతార సంబంధమా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడో పట్టణ సీఐ మోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.