Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నాడు నేడు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆర్థర్‌

విశాలాంధ్ర` నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల యందు జగనన్న నాడు నేడు పేస్‌ టు కింద ఒక కోటి 30 లక్షల నిధులు మంజూరైనటువంటి అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ, సచివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్థర్‌ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మాధవరం సుశీలమ్మ, ఎంపీడీవో శోభారాణి, తాసిల్దార్‌ రాజశేఖర్‌ బాబు, ఎంఈఓ ఫైజునిసా బేగం, సింగిల్‌ విండో చైర్మన్‌ మద్దూరు హరి సర్వోత్తమ్‌ రెడ్డి, విద్య కమిటీ చైర్మన్‌ డాలు స్వాములు, స్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయులు ఇమ్మానుయేలు, సర్వ శిక్ష అభియాన్‌ డిఇ ఈశ్వరయ్య, గ్రామ వైసిపి నాయకులు మాధవరం రత్నం, సంజన, వేల్పుల నాగన్న, జైపాల్‌, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img