విశాలాంధ్ర`పెద్దకడబూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామానికి చెందిన ఎస్. అంజినప్పను సోమవారం ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది. ఇందుకు సహకరించిన ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, ధరణిరెడ్డి, మనోజ్ రెడ్డి, బాపురం చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.