Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం మంత్రాలయం తాలూకా కార్యదర్శి ఆంజనేయ డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ సెక్రటరీ మారుతి రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పత్తి పంట దిగుబడి అంతంత మాత్రమే ఉందని, అయితే పత్తి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక పోవడంతో రైతాంగం అపారంగా నష్టపోయారని సెక్రటరీ దృష్టికి తెచ్చారు. తక్షణమే పత్తి పంటకు క్వింటాళ్లకు 10,500 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సత్యన్న, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img