Friday, April 19, 2024
Friday, April 19, 2024

పార్టీ కోసం శ్రమిస్తున్న కేఈ ప్రభాకర్‌

ఘనంగా పుట్టినరోజు వేడుకలు
విశాలాంధ్ర`ఆస్పరి :
అధికారం ఉన్నా, లేకున్నా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ పార్టీ కోసం, ప్రజల కోసం ఎంతగానో శ్రమిస్తున్నారని టిడిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు సాలి సాహెబ్‌, మాజీ మండల కన్వీనర్‌ శ్రీనివాసుల గౌడ్‌, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఉచ్చీరప్ప యాదవ్‌, వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యదర్శి తిమ్మన్న లు అన్నారు. బుధవారం కేఈ ప్రభాకర్‌ 67వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, బాలింతలకు పళ్ళు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనోబలం కల్పించి, జిల్లా లో వాడవాడలా పార్టీని బలోపేతం చేసిన ఘనత కేఈ కుటుంబానికి దక్కుతుందన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నాయకుడి పుట్టినరోజును పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక పథకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని, ఏదో ఒకనాడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. టిడిపి పార్టీ బీసీల పార్టీ అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టాడానికి, చంద్రబాబును ముఖ్యమంత్రి పదవిలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు అలుపెరుగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు వీరేష్‌, టిడిపి సీనియర్‌ నాయకులు నారాయణ, నాగన్న, స్టూడియో వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img