Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఏఎన్ఎంలు సునీత, నాగలక్ష్మి సూచించారు. శనివారం మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామ సచివాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ బుడ్డ అంజినమ్మ, వైసీపీ నాయకులు శివరాం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు . అలాగే నెలసరి టీకాలను వేయించుకోవాలని, తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ రాజేశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img