విశాలాంధ్ర`నందికొట్కూరు : రాష్ట్ర వైసీపీ ప్రభుత్వంలో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో నీ 20వ వార్డులో కార్యకర్తలతో కలిసి ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మనకి అనే కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఈ మూడున్నర సంవత్సరకాలంలో వైసీపీ వారు చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను ప్రజలకు తెలియజేస్తూ వివరించడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ మీకు అండగా నేను ఉంటానని వెన్ను తట్టి వారికి గట్టి భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని త్వరలోనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి, నందికొట్కూరు కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి చిన్న వెంకటస్వామి, జై సూర్య, మాజీ కౌన్సిలర్ ముత్తు, మైనార్టీ సెల్ అధ్యక్షులు షకీల్ అహ్మద్, ఖాతా రమేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రవీంద్రబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.