Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపండి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా కార్య వర్గ సభ్యులు పరమేష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బసలదొడ్డి, హులికన్వి, ముచ్చిగిరి, నౌలేకల్ గ్రామాల్లో ప్రచార భేరి కార్యక్రమ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమమే ప్రచార భేరి అని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ ఐ సి, రైల్వేలు, పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మోడీ పాలనలో భారత్ వెలిగిపోవడంలేదని, ఆరిపోయే దీపంలా అప్పుల ఊబిలో కొట్టు మిట్టాడుతుందని ఆరోపించారు. అమరావతి రాజధాని, విభజన హామీలు, విశాఖ ఉక్కు తదితర అంశాలపై బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, ఈరన్న, రామిరెడ్డి, నాగప్ప, చిన్న వెంకటేశ్, ఆనందు, గోపాల్, బసవరాజు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img