పార్టీ బలోపేతమే లక్ష్యం
మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
విశాలాంధ్ర` ఆలూరు : రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆలూరు టీడీపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు. బుధవారం హాలహర్వి మండలం చత్రగుడి ఆంజనేయ స్వామి దేవాలయం కళ్యాణ మండపంలో టిడిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని మండల కన్వీనర్ సుధాకర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ పార్టీ అధినేత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇదేం కర్మ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని, ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యల్ని, కష్టాల్ని తెలుసుకోని వారికి అండగా ఉంటామని భరోసా కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అవగాహన కల్పించి వాటిపై ప్రజల్లో చర్చ జరిగేలా చూస్తామన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఉత్సాహంతో గ్రామాల్లోని టిడిపి నాయకులు కార్యకర్తలు ఐక్యమత్యంతో పార్టీని బలోపేతం చేసి 2024 ఎన్నికల్లో ఆలూరులో టిడిపి జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రఘు ప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పిటిసి మురళీధర్ రెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్ రెడ్డి, ముత్యాల రెడ్డి, కృష్ణమనాయుడు, వీరేశప్ప, వెంకటేష్ రెడ్డి, హరిరెడ్డి, పాల్ రెడ్డి, శ్రీధర్, మారుతి, వెంకటేష్ చౌదరి, ఉమాకాంత స్వామి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ కన్వీనర్లు అశోక్, పరమా రెడ్డి, విజయ్ భాస్కర్ గౌడ్, మాజీ చైర్మన్ నౌనేపాటి చౌదరి, మాజీ డైరెక్టర్ కృష్ణ యాదవ్, నర్సిరెడ్డి, సర్పంచ్ ఆంజనయ్య, మహేష్, కృష్ణమూర్తి, మునిస్వామి, సుధాకర్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తలారి సిద్దు తదితరులు పాల్గొన్నారు.