Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రైతులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

ఎల్‌ ఎల్‌ సి మాజీ డైరెక్టర్‌ గడ్డం నారాయణరెడ్డి
విశాలాంధ్ర-ధర్మవరం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రైతులను మోసం చేస్తున్నారని ఎల్‌ ఎల్‌ సి మాజీ డైరెక్టర్‌ గడ్డం నారాయణ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ. రాయలసీమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్న …. ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టుకు కూడా పిడికెడు మన్ను వేసిన పాపాన పోలేదని ఆరోపించారు. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తున్నా వేళా … ఏ ఒక్క మంత్రి గాని ఎమ్మెల్యే గాని రైతుని పలకరించిన దాఖలాలు లేవని అన్నారు. రైతు ప్రభుత్వం రైతుబిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం రైతులపై అనుకున్న పేమెంటు తెలిసిపోతుందని అన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లాలోని ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ కు 70 సం ‘‘ నుండి ఎంతోమంది నాయకులు వచ్చిన ఒక్కరు కూడా ఆర్డీఎస్‌ గురించి మాట్లాడిన దాకలాలు లేవన్నారు. 70 సం ‘‘ ప్రాజెక్ట్‌ కు అందులో సగం వయసు లేని బివి జయనగేశ్వర రెడ్డి సాధించడం గొప్పతనం అని , అది జీర్ణించుకోలేక నాయకులు ఆర్డీఎస్‌ ను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సంవత్సరం తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని , బివి జయనగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఎస్‌ ను పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులపై ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా వాటి గురించి ప్రస్తావించలేకపోవడం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు చేసుకున్న దురదృష్టం అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఆర్డీఎస్‌ కు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులను ప్రారంభిస్తే వాటిని ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వానికి చేతకాలేదని అన్నారు .ముఖ్యమంత్రి జగన్‌ మంత్రులు ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా త్వరలోనే మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయబడుతున్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img