మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
విశాలాంధ్ర`వెలుగోడు : కర్నూలు జిల్లాలో జరిగే టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వెలుగోడు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మరియు మండల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమావేశ%శీ% నిర్వహించారు. ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బాదుడే – బాదుడు కార్యక్రమం పాల్గొంటారని , ఈ పర్యటన లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ కలాం , శేషిరెడ్డి , హిదాయత్ , రఘు రామిరెడ్డి , శంకర రెడ్డి , నజీర్ , రామానాయుడు, నాగశేఖర్ , వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.