Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్ గురు అమరులై దేశాన్ని బానిస సంకెళ్లు నుంచి విముక్తి చేశారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశ భక్తి ముసుగులో నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్య పడుతుందని ఆరోపించారు. దేశంలో మానభంగాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో దేశంలో మార్పు మొదలు కాకపోతే మత ఘర్షణలు పెరిగే అవకాశం ఉందన్నారు. కావున దేశ ప్రజలందరూ భగత్ సింగ్ ను స్ఫూర్తిని తీసుకొని లౌకింగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ, రంగస్వామి, గురుస్వామి, శివకుమార్, నాగరాజు, తిమ్మప్ప, రామాంజి, మల్లి, చిన్నోడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img