Friday, April 19, 2024
Friday, April 19, 2024

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న మండల విద్యాధికారిణి సువర్ణ సునియం
విశాలాంధ్ర- పెద్దకడబూరు : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని మండల విద్యాధికారిణి సువర్ణ సునియం ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారిణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మద్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని వంట ఏజెన్సీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎం ఐ ఎస్ కో ఆర్డినేటర్ లక్ష్మన్న, సి ఆర్ పి లు లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img