Friday, April 19, 2024
Friday, April 19, 2024

మోడీ ప్రభుత్వం ప్రజలను ముంచే ప్రభుత్వం

మోడీ ప్రభుత్వం ప్రజలను ముంచే ప్రభుత్వం అని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేష్ విమర్శించారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరు లోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి మండలంలోని వివిధ గ్రామాలలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. దీంతో ప్రజల నుంచి అనేక సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అటు కేంద్రం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ, అదాని, అంబాని వంటి కార్పోరేట్లకు ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల కార్యదర్శి లక్ష్మణ్, ఏఐకెఎస్ తాలూకా కార్యదర్శి ఆంజనేయ, డివైఎఫ్ఐ నాయకులు దేవదాసు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హనుమంతు, సిఐటియు మండల కార్యదర్శి ఈరన్న, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, డోలు హనుమంతు, వీరేష్, నాగరాజు, గిడ్డయ్య, గోపాల్, వీరాంజనేయులు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img