విశాలాంధ్ర`పెద్దకడబూరు : మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినీలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ నందు జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో కంబలదిన్నె విద్యార్థినీలు ప్రతిభను చాటారు. అండర్ 17 విభాగంలో టెన్నికాయిట్ నందు బీకే లక్ష్మి ప్రతిభ కనబరిచింది. అలాగే అండర్ 14 విభాగంలో భారతి ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని మండల విద్యాధికారిణి సువర్ణ సునియం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పీఈటి ఉపాధ్యాయులు వీరేష్ , ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.