విశాలాంధ్ర-ఆదోని : అధిక వర్షాలు, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఎకరాకు రూ.60వేలు నష్టపరిహారం అందించి వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రైతు రక్షణ కాలినడక యాత్రను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్యలు ప్రారంభించారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక శ్రీనివాస్ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన యాత్ర భీమా సర్కిల్ మీదుగా కంట్రోల్ రూమ్, కొత్త బస్టాండ్, ఆస్పరి బైపాస్ మీదుగా విరుపాపురానికి చేరుకోనుంది. ఈ యాత్రకు వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.