Friday, April 19, 2024
Friday, April 19, 2024

వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారిణి సువర్ణ సునియం అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో మండల విద్యాధికారిణి సువర్ణ సునియం వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేసుకోకుండా గ్రంథాలయాలను వినియోగించుకోవాలన్నారు. గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయని, వాటిని చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం పుస్తక ప్రదర్శన, పుస్తక పఠనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఐ ఎస్ కో ఆర్డినేటర్ లక్ష్మన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img